హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్స్కీమ్ డీపీఆర్ను పరిశీలించాలని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)ను తెలంగాణ కోరింది. ఈ ప్రాజెక్టుపై ప్రస్తుతం న్యాయవివాదాలు లేనందున డీపీఆర్ను పరిశీలించి అనుమతులివ్వాలని కోరుతూ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ సీడబ్ల్యూసీ చైర్మన్కు శుక్రవారం లేఖ రాశారు. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపై ఏపీ దాఖలు చేసిన పిటిషన్ ఇన్నాళ్లు బ్రిజేశ్కుమార్ట్రిబ్యునల్వద్ద పెండింగ్లో ఉన్నందున డీపీఆర్పరిశీలన సబ్జ్యుడిస్ అవుతుందని సీడబ్ల్యూసీ పక్కన పెట్టిందని లేఖలో ప్రస్తావించారు.
ఈ అంశం తమ పరిధిలోకి రాదని ఇటీవల బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించిందని, ఈ నేపథ్యంలో డీపీఆర్పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు బచావత్ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల్లో నుంచి మైనర్ఇరిగేషన్లో వినియోగించుకోని 45 టీఎంసీలను పాలమూరుకు కేటాయించామని తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి నీళ్లకు బదులు నాగార్జున సాగర్కు ఎగువన ఉన్న ప్రాజెక్టులకు 80 టీఎంసీలను కేటాయించాలని బచావత్ ట్రిబ్యునల్ఆర్డర్ఇచ్చిందని గుర్తు చేశారు.
2009లోనే పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీలోని టీఏసీ క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. 2013లో నిర్వహించిన ఏపీ స్టేట్ లెవల్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పోలవరం నుంచి మళ్లించే నీళ్లకు బదులు 45 టీఎంసీలను కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై ప్రస్తుతం కోర్టుల్లో ఎలాంటి న్యాయవివాదాలు లేనందున ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలించి అనుమతులు ఇవ్వాలని కోరారు.