ఎల్‌‌‌‌‌‌‌‌బ్రస్‌‌‌‌‌‌‌‌ పర్వతాన్ని ఎక్కిన తెలంగాణ యువకుడు

ఎల్‌‌‌‌‌‌‌‌బ్రస్‌‌‌‌‌‌‌‌ పర్వతాన్ని ఎక్కిన తెలంగాణ యువకుడు

అభినందించిన ములుగు, వరంగల్ కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ప్రావీణ్యములుగు/మంగపేట, వెలుగు : ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒకటైన ఎల్‌‌‌‌‌‌‌‌బ్రస్‌‌‌‌‌‌‌‌ను  ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడెం గ్రామానికి చెందిన వాసం వివేక్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ అధిరోహించాడు. రష్యా, జార్జియా సరిహద్దులోని 5,642 మీటర్ల (18,510 అడుగులు) ఎత్తు ఉండే ఈ పర్వతాన్ని వివేక్‌‌‌‌‌‌‌‌ ఈ నెల 15న ఎక్కాడు.

వివేక్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం వరంగల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్​ ప్రావీణ్య, ములుగు కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఇలా త్రిపాఠిని కలువగా వారు శాలువాతో సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో వరంగల్‌‌‌‌‌‌‌‌ అడిషనల్ కలెక్టర్​కోట వాత్సల్య, ములుగు ఆర్డీవో సత్యపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, రెడ్‌‌‌‌‌‌‌‌ క్రాస్‌‌‌‌‌‌‌‌ సొసైటీ సభ్యులు ఈవీ.శ్రీనివాసరావు, కె.ప్రసాదరావు, కొట్టె రాజిరెడ్డి, బండి ఈశ్వర్, కుసుమ శ్యాంసుందర్ పాల్గొన్నారు.