డ్రగ్స్ కేసులో హీరో నవదీప్.. అరెస్ట్ కోసం పోలీసులు గాలింపు

డ్రగ్స్ కేసులో హీరో నవదీప్.. అరెస్ట్ కోసం పోలీసులు గాలింపు

మాదాపూర్ డ్రగ్స్ కేసు కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ డ్రగ్స్  కేసులో ఓ హీరో , మరో సినీ నిర్మాత అడ్డంగా బుక్కయ్యారు. హీరో నవదీప్ తో పాటు..నిర్మాత  సుశాంత్ రెడ్డి మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఉన్నట్లు తేలింది. ఈ కేసులో  నార్కోటిక్స్ అధికారులు నిర్మాత సుశాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు.  గుడి మల్కాపురం పోలీసులతో కలిసి ఆపరేషన్ నిర్వహించిన నార్కోటిక్స్ అధికారులు.. ముగ్గురు నైజీరియన్లతో పాటు నిర్మాత సుశాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.  ప్రస్తుతం హీరో నవదీప్ పరారీలో ఉన్నాడు. 

Also Read :- టాలీవుడ్లో డ్రగ్స్ కలకలం.. మరో నిర్మాత అరెస్ట్

మాదాపూర్ డ్రగ్స్ కేసు విచారణలో హీరో నవదీప్ కూడా డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని చెప్పారు. త్వరలోనే వారిని పట్టుకుంటాం" అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.హీరో నవదీప్ స్నేహితుడు రాంచంద్ ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. రాంచంద్ ద్వారా నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. షాడో ప్రొడ్యూసర్ రవి ఉప్పలపాటి కూడా పరారీలో ఉన్నాడని తెలిపారు. 

మదాపూర్ డ్రగ్స్ కేసులో  నార్కోటిక్ విభాగం అధికారులు 50 గ్రాముల MDMA తో పాటు 8 గ్రాముల కొకైన్ ,24 ఎస్టసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ డ్రగ్స్ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో మొత్తం డ్రగ్స్ బెంగుళూరు నుండి వచ్చిందన్నారు. ఒక  ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటికే కొందరు  నైజీరియన్లు వీసా   గడపు ముగిసినా కూడా దేశంలో ఉంటున్నారని..వారిపై నిఘా పెట్టామన్నారు.  బెంగుళూరులో 18 మంది నైజీరియాలు ఉన్నారని గుర్తించామన్నారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారిలో వరంగల్ చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారని సమాచారం ఉందన్నారు.  సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారని...ఈ కేసులో మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ రావు అరెస్ట్ చేశామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.