
అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు లీడ్గా కృష్ణ పోలూరు రూపొందించిన వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : పీసీ మీనా రిపోర్టింగ్’. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్పై కేవీ శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్.. జూన్ 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
‘రెక్కీ’లాంటి సీడ్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తర్వాత.. మళ్ళీ అదే మేకర్స్ గ్యాప్ తీసుకుని, తెరకెక్కించిన మరో తెలుగు సిరీస్ విరాటపాలెం. ఇన్వెస్టిగేషన్తో పాటు మూఢ నమ్మకాల కాన్సెప్ట్ని ఇందులో టచ్ చేశారు.
ALSO READ | Kuberaa Review: కోటీశ్వరుడు vs బిచ్చగాడు.. శేఖర్ కమ్ముల లక్ష కోట్ల స్కామ్ కథేంటంటే?
గురువారం ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. అతిథిగా హాజరైన నవీన్ చంద్ర మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా ఎంగేజింగ్గా ఉంది. అభిజ్ఞ పోలీస్ ఆఫీసర్గా పర్ఫెక్ట్గా ఉన్నారు. ఈ సిరీస్తో టీమ్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’ అని టీమ్కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. హీరోయిన్ అభిజ్ఞ మాట్లాడుతూ ‘మూఢ నమ్మకాల మీద పోరాడే కథ ఇది.
ఇలాంటి కథలు, పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని చెప్పింది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది అని చరణ్ లక్కరాజు అన్నాడు. ఆడియెన్స్ను ఎంగేజ్ చేసేలా ఈ సిరీస్ ఉంటుందని దర్శక నిర్మాతలు చెప్పారు. కథ అందించిన దివ్య, జీ5 కంటెంట్ హెడ్ సాయి తేజ్ పాల్గొన్నారు.
‘రెక్కీ’వెబ్ సిరీస్:
‘రెక్కీ’ అనేది ఒక తెలుగు క్రైమ్-థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది 2022లో ZEE5లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సిరీస్ లో శ్రీరామ్, శివ బాలాజీ, ధన్య బాలకృష్ణ, ఆడుకలం నరేన్ మరియు ఇతర నటులు నటించారు.
ఈ సిరీస్ 1990లో ఆంధ్రప్రదేశ్ లోని తాడిపత్రి అనే గ్రామంలో జరిగిన రెండు హత్యల కేసును విచారించే పోలీసు అధికారి చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ ను పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. 25 నిమిషాల వ్యవధితో మొత్తం 7 ఎపిసోడ్లుగా రెక్కి రూపొందించారు.