ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి

ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి

ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి చెందింది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల(23) అనే యువ వైద్యురాలు ప్రమాదవశాత్తు లోయలో పడి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల(23) అస్ట్రేలియాలో మృతి చెందింది. ఈ సంఘటనలో ఉజ్వల మరణించడం తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.  ఈ ఘటన 2024, మార్చి 2న జరిగింది.

 అంత్యక్రియల నిమిత్తం శనివారం భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి తీసుకొస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్‌ విశ్వవిద్యాలయంలో వేమూరు ఉజ్వల ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం రాయల్‌ బ్రిస్బేన్‌ ఉమెన్స్‌ ఆసుపత్రిలో ఆమె పని చేస్తుంది. ఉజ్వల తల్లిదండ్రులైన వేమూరు వెంకటేశ్వరరావు, మైథిలి కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు.