బంగాళాఖాతంలో వాయుగుండం : తెలంగాణలో దసరాకు మండనున్న ఎండలు

బంగాళాఖాతంలో వాయుగుండం : తెలంగాణలో దసరాకు మండనున్న ఎండలు

మరో మూడు రోజుల్లో  బంగాళఖాతంలో వాయుగుండం ఏర్పడనుంది. ఇది ఆగ్నేయ బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం దిశగా  అక్టోబర్ 22 నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుంది.  అయితే దీని ప్రభావంతో ఏపీకి వర్ష సూచన ఉండగా.. తెలంగాణలో మాత్రం ఇందుకు భిన్నంగా  ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.  ఇప్పటికే  హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. అయితే తీవ్ర వాయుగుండం కారణంగా దసరాకు  ఉష్ణోగ్రత పెరగనుంది.

ఇప్పటికే తెలంగాణలో వర్షాలు లేక దాదాపు నెలరోజులు కావొస్తుంది. అక్టోబర్ లో సున్నా డిగ్రీల వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.  మధ్యాహ్నం ఎండలు, రాత్రిపూట చలితో భిన్న వాతావరణం కనిపిస్తోంది.  నవంబర్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం  ఉండనున్నట్లు తెలుస్తోంది.  నవంబర్ 15 తర్వాత చలి పెరిగే అవకాశముందని చెబుతున్నారు.