
కర్నాటకలో రథం కుప్పకూలిన ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. చామరాజనగర్ లోని వీరభద్రేశ్వర ఆలయానికి చెందిన రథానికి ఉన్న చక్రం విరగడంతో ఒక్కసారిగా పడిపోయింది. వెంటనే భక్తులు పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆలయ వార్షికోత్సవాల్లో ఊరేగింపు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కార్తీక మాసంలో జరిగే రథోత్సవం కోసం రథాన్ని బయటకు తీశారు. కానీ అనుకోకుండా ఈ ఘటన చోటుచేసుకుంది. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైనదని చెబుతారు. దక్షబ్రహ్మ అనే రాక్షసుడిని చంపిన శివుని గౌరవార్థం ఈ ఆలయాన్ని నిర్మించారు.