కర్నాటకలో కుప్పకూలిన రథం.. తప్పిన ప్రమాదం

కర్నాటకలో కుప్పకూలిన రథం.. తప్పిన ప్రమాదం

కర్నాటకలో రథం కుప్పకూలిన ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. చామరాజనగర్ లోని వీరభద్రేశ్వర ఆలయానికి చెందిన రథానికి ఉన్న చక్రం విరగడంతో ఒక్కసారిగా పడిపోయింది.  వెంటనే భక్తులు పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.  ఆలయ వార్షికోత్సవాల్లో ఊరేగింపు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.  

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కార్తీక మాసంలో జరిగే రథోత్సవం కోసం రథాన్ని బయటకు తీశారు. కానీ అనుకోకుండా ఈ ఘటన చోటుచేసుకుంది. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైనదని చెబుతారు. దక్షబ్రహ్మ అనే రాక్షసుడిని చంపిన శివుని గౌరవార్థం ఈ ఆలయాన్ని నిర్మించారు.