ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు

ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు

అమరావతి  : ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని ఏపీలో ఇప్పటి వరకు కొత్త వైరస్ బారిన పడిన వారి సంఖ్య 16కు చేరింది. 10 కొత్త కేసుల్లో ఏడుగురు విదేశాల నుంచి వచ్చిన వారు కాగా... ముగ్గురు వారి కాంటాక్ట్ లుగా గుర్తించారు. బాధితులు కువైట్, నైజీరియా, సౌదీ అరేబియా, అమెరికా నుంచి వచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో మూడు కేసులు రాగా.. అనంతపురం, కర్నూలులో 2, పశ్చిమ గోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. బాధితులంతా ఆరోగ్యంగానే ఉన్నారని, ఐసోలేషన్ లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. 
 

మరిన్ని వార్తల కోసం..

నల్గొండ జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష

లీటర్ పెట్రోల్ ధర రూ.25 తగ్గింపు