నల్గొండ జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష

నల్గొండ జిల్లా అభివృద్ధిపై  సీఎం కేసీఆర్ సమీక్ష

నల్గొండ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. నల్గొండ పట్టణ, మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై సీఎం చర్చించారు. మున్సిపాలిటీల్లో రోడ్ల నిర్మాణం, జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పురోగతి గురించి  కేసీఆర్ ఆరా తీశారు.  మీటింగ్ లో మంత్రులు జగదీశ్ రెడ్డి, హరీష్ రావు, శ్రీనివాస గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ కు బయలుదేరారు.

మరిన్ని వార్తల కోసం..

మోటర్ లేకుండానే బోరు నుంచి ఉబికివస్తున్న నీరు

దొంగతనం నెపంతో యూపీలో దళిత బాలికపై దాడి