జీహెచ్ఎంసీ రిజల్ట్స్ పై మంత్రుల్లో దడ!

జీహెచ్ఎంసీ రిజల్ట్స్ పై మంత్రుల్లో దడ!
  • పొలిటికల్​ కెరీర్​పై ఎఫెక్ట్​ పడ్తుందనే ఆందోళన
  • సీరియస్​గానే పనిచేసిన కొందరు.. ఉండీ లేనట్టున్న మరికొందరు
  • సరిగా పనిచేయని మంత్రులపై సీఎంకు నిఘా వర్గాల రిపోర్టు

హైదరాబాద్, వెలుగుమంత్రులకు జీహెచ్ఎంసీ ఎలక్షన్​ రిజల్ట్స్​పై భయం పట్టుకుంది. తమకు అప్పగించిన డివిజన్లలో పార్టీ క్యాండిడేట్​ ఓడిపోతరేమోనన్న టెన్షన్​ కనిపిస్తోంది. ఒకవేళ రిజల్ట్స్​ నెగిటివ్​గా వస్తే.. ప్రగతి భవన్ నుంచి క్లాస్​ తప్పదని, భవిష్యత్తులో పార్టీలో ఇబ్బందులు ఎదురయ్యే చాన్స్​ ఉందని మంత్రులు ఆందోళన చెందుతున్నారు. టీఆర్ఎస్​ గ్రేటర్​ ఎలక్షన్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఒక్కో డివిజన్ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఎలక్షన్​ బాధ్యతలు తీసుకున్న మంత్రులు.. ప్రచారం కోసం తమ సొంత జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలను సిటీకి తరలించారు.

వారం పాటు అంతా డివిజన్లలో మకాం వేసి ప్రచారం చేశారు. కొందరు మంత్రులైతే క్యాండిడేట్ల కంటే ఎక్కువ  తిరిగి, డివిజన్లలో పార్టీ పరిస్థితిని హైకమాండ్​కు చేరవేశారు. క్యాండిడేట్​తరఫున పార్టీ ఇచ్చిన ఫండ్స్​తోపాటు సొంత పైసలు ఖర్చు చేశారు. ఇంతచేసినా పలుచోట్ల పార్టీ క్యాండిడేట్లు గెలిచే చాన్స్ లేదని టీఆర్ఎస్ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. మినిస్టర్లు ఎలక్షన్​ బాధ్యతలు తీసుకున్న చాలా డివిజనల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉన్నట్టు చర్చ ఉంది. దీంతో కొందరు మంత్రులు తమ సొంత ఎలక్షన్​గా భావించి సీరియస్ గా పనిచేశారని.. మరికొందరు పెద్దగా దృష్టి పెట్టలేదని పార్టీ లీడర్లు అంటున్నారు. కొందరు చుట్టపుచూపుగా వచ్చి ప్రచారం చేశారని, ఒకరిద్దరు పొద్దున ఓసారి, సాయంత్రం మరోసారి కనిపించి వెళ్లిపోయారని చెప్తున్నారు. ఏ మంత్రి ఎంత సీరియస్ గా పనిచేశారు, ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారన్న దానిపై ఇంటెలిజెన్స్​ వర్గాలు ప్రగతిభవన్ కు రిపోర్టు ఇచ్చాయని ఓ సీనియర్ నేత తెలిపారు.

అయినా నెగెటివే!

ఓ మంత్రికి ఒక డివిజన్ బాధ్యతను అప్పగిస్తే.. ఆయనేమో 3 డివిజన్లపై నజర్​ పెట్టారని పార్టీలో చర్చ జరుగు తోంది. వాటిలో గెలవాలని గట్టిగా పనిచేశారని అంటు న్నారు. ‘‘ఎలక్షన్​ నోటిఫికేషన్ రాగానే.. తమ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలను ఆయన పిలిపించుకున్నారు. పాదయాత్రలు, సభలు నిర్వహించారు. వ్యతిరేకత ఉన్న కాలనీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అయినా 3 డివిజన్లలో రెండు చోట్ల టీఆర్ఎస్ కు నెగిటివ్ వేవ్ కనిపించింది” అని పార్టీ లీడర్​ ఒకరు అన్నారు.

ఏ డివిజన్ ఏమంత్రికి ఇచ్చిన్రు

డివిజన్                                  మంత్రి

మీర్ పేట                               ఎర్రబెల్లి దయాకర్ రావు

చిలుకానగర్                           సత్యవతి రాథోడ్

సరూర్ నగర్                           జగదీశ్ రెడ్డి

హిమాయత్ నగర్                    గంగుల కమలాకర్

అడిక్ మెట్                             శ్రీనివాస్ గౌడ్

అంబర్ పేట                            నిరంజన్ రెడ్డి

బంజారాహిల్స్                        ఇంద్రకరణ్‌‌ రెడ్డి

కేపీహెచ్ బీ                            పువ్వాడ అజయ్

హైదర్ నగర్                           కేటీఆర్

గాజులరామారం                      ప్రశాంత్ రెడ్డి

రంగారెడ్డినగర్                        మల్లారెడ్డి

వెంకటాపురం                         కొప్పుల ఈశ్వర్

మల్కాజిగిరి                          ఈటల రాజేందర్

భారతీనగర్                           రీశ్ రావు

బన్సీలాల్ పేట                       తలసాని శ్రీనివాస్ యాదవ్