యూఎస్ కాన్సులేట్ వద్ద ఉద్రిక్తత

యూఎస్ కాన్సులేట్ వద్ద ఉద్రిక్తత
  • ..ఇరాన్ పై దాడిని ఖండిస్తూ ధర్నాకు పిలుపు
  • ఎక్కడికక్కడ లెఫ్ట్ పార్టీల నేతల అరెస్ట్​

గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలోని అమెరికా కాన్సులేట్​ఆఫీస్​వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్​కు అమెరికా మద్దతు తెలపడాన్ని నిరసిస్తూ యూఎస్ కాన్సులేట్ వద్ద వామపక్ష పార్టీలు ధర్నాకు పిలుపునిచ్చాయి. ఇరుదేశాలు చేస్తున్న యుద్ధాన్ని తక్షణమే ఆపాలని సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్, ఎంసీపీఐ(యూ), సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఎస్‌యూసీఐ(సీ), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని అమెరికన్ కాన్సులేట్ వద్ద నిరసన తలపెట్టారు.

గౌలిదొడ్డి నుంచి ర్యాలీగా బయలుదేరిన వామపక్ష పార్టీల నేతలను సైబరాబాద్ పోలీసులు అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్ట్​చేశారు. డీసీఎంలో  నార్సింగి, గచ్చిబౌలి పీఎస్​లకు తరలించారు. అరెస్టయిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మ, పాలమాకుల జంగయ్య, ప్రభు లింగం తదితరులు ఉన్నారు.