హయత్ నగర్ కుంట్లూరు రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారుల షాపులను తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.భారీ పోలీస్ బందోబస్తు మధ్య షాపులను తొలగిస్తున్నారు.ఎలాంటి సమాచారం ఇవ్వకుండా షాపులను తొలగించడంపై పోలీసులతో వాగ్వాదానికి దిగారు చిరు వ్యాపారులు. జీహెచ్ఎంసీ అధికారుల తీరునకు నిరసనగా..రోడ్డుపై ఆందోళనకు దిగారు. జీవనోపాధి కోల్పోవడంతో తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం