దండేపల్లి టెన్త్ స్టూడెంట్ ఘటనలో ముగ్గురిపై చర్యలు .. ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాసిన వైనం..!

దండేపల్లి టెన్త్ స్టూడెంట్ ఘటనలో ముగ్గురిపై చర్యలు .. ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాసిన వైనం..!
  • కలెక్టర్​కు రిపోర్ట్​ అందజేసిన  బెల్లంపల్లి ఎంఈవో పోచయ్య
  • నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, 
  • డిపార్ట్ మెంటల్ ఆఫీసరపై వేటుకు రంగం సిద్ధం

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా దండేపల్లి హైస్కూల్ టెస్త్ స్టూడెంట్ సిద్ది అంజమ్మ ఘటనలో ఆఫీసర్లపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. అంజమ్మ అడ్వాన్డ్స్​సప్లిమెంటరీ ఎగ్జామ్స్​లో భాగంగా గత నెల 8న మంచిర్యాల జడ్పీ గర్ల్స్​ హైస్కూల్​ సెంటర్​లోని 4వ నంబర్​ రూమ్​లో మ్యాథ్స్​పరీక్ష రాసింది. ఆమెకు ఐదో నంబర్​ రూమ్​కేటాయించగా.. మరో విద్యార్థిని స్థానంలో నాలుగో నంబర్​ రూమ్​లో కూర్చొని ఎగ్జామ్ రాసింది. 

ఇన్విజిలేటర్ మధుసూదనాచారితో పాటు సెంటర్​చీఫ్​సూపరింటెండెంట్​పద్మావతి, డిపార్ట్​మెంటల్​అధికారి బి.రవీందర్​ఈ విషయాన్ని గమనించకుండా అంజమ్మ ఆబ్సెంట్​అయినట్టు రిపోర్టు ఇచ్చారు. దీంతో ఆమె ఫెయిల్ అయినట్లు రిజల్ట్ వచ్చింది. దీంతో అంజమ్మ విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు ఆన్సర్​షీట్లను పరిశీలించి ఆమె ఎగ్జామ్ రాసినట్లు నిర్ధారించి పాస్​చేస్తూ తాజాగా మెమో జారీ చేశారు. ఈ విషయంలో బాధ్యులైన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీఈవోకు సూచించారు. ఈ మేరకు బెల్లంపల్లి ఎంఈవో పోచయ్య విచారణ జరిపి రిపోర్ట్ ను బుధవారం సాయంత్రం కలెక్టర్​ కుమార్​దీపక్​తో పాటు అడిషనల్​కలెక్టర్, ఇన్​చార్జి డీఈవో పి.చంద్రయ్యకు అందజేశారు. 

ముగ్గురు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అంజమ్మకు అన్యాయం జరిగిందని నిర్ధారించారు. దీంతో ఇన్విజిలేటర్, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ పై సస్పెన్షన్​ వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయమై కలెక్టర్​కుమార్​దీపక్​ మాట్లాడుతూ.. ఎంక్వైరీ రిపోర్టు అందిందని, బాధ్యుల నుంచి వివరణ తీసుకున్న అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.