జమ్ము కశ్మీర్ లో ఎన్ కౌంటర్.. టెర్రరిస్టు హతం

జమ్ము కశ్మీర్ లో ఎన్ కౌంటర్.. టెర్రరిస్టు హతం

జమ్ము కశ్మీర్లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఈ ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. సోపోర్ జిల్లా మల్మన్ పొర ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ గాలింపు చేపట్టింది. కార్డన్ సెర్చ్ చేపట్టడంతో టెర్రరిస్టులు ఫైరింగ్ చేశారు. దీంతో భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులు చేశాయి. చాలా సేపు ఎన్ కౌంటర్ కొనసాగింది. ఈ ఘటనలో ఓ టెర్రరిస్టును హతమార్చింది ఆర్మీ. మరోవైపు ఓ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. నిన్న సాయంత్రం షోపియాన్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం  ఉగ్రవాదులు ఇంకా అక్కడే ఉండడంతో గాలింపు జరుగుతోంది.