తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. జూన్ 12న జరిగిన టెట్ ఎగ్జామ్ కు టెట్ పేపర్ 1కు 3,18,506 మంది, పేపర్ 2కు 2,51,070 మంది హాజరయ్యారు. పేపర్ 1లో 32.68 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. పేపర్ 2లో 49.64 శాతం మంది పాస్ అయ్యారు. పేపర్ 1లో 1,04.078 మంది అభ్యర్థులు.. పేపర్ 2లో 1, 24,535 అభ్యర్థులు పాస్ అయ్యారు.
ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ అధికారులు చెప్పిన సమయం దాటిన వెబ్ సైట్ మాత్రం ఓపెన్ కాలేదు. తర్వాత ఓపెన్ అయ్యింది. దీంతో కాసేపు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. టెట్ ఫలితాల విడుదలలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫలితాలను విద్యాశాఖ ఒకే వెబ్ సైట్ కు లింక్ చేసిందని.... గతంలో రెండు లేదా మూడు వెబ్ సైట్ లో ఫలితాలు విడుదల చేసేవారని వారు ఆరోపిస్తున్నారు. టెట్ లో ఎంత మంది క్వాలిఫై అయ్యారో కనీసం మీడియాకి కూడా సమాచారం ఇవ్వలేదని అభ్యర్థులు విద్యా శాఖపై విమర్శలు చేశారు.