విద్యాశాఖ బదిలీల గైడ్ లైన్స్ సవరించాలి: టీజీఎల్​ఏ రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం

విద్యాశాఖ బదిలీల గైడ్ లైన్స్ సవరించాలి: టీజీఎల్​ఏ రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం

హైదరాబాద్, వెలుగు: సర్కారు కాలేజీల్లో పనిచేసే లెక్చరర్ల బదిలీలకు విద్యాశాఖ రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ సవరించాలని తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కనకచంద్రం డిమాండ్ చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మదర్ జీవో 80లోని స్పౌజ్, మె డికల్ తదితర కీలకమైన అంశాలను పక్కనపెట్టడం సరికాదన్నారు. విద్యాశాఖ ఉత్తర్వులతో సుదీర్ఘ కాలంగా ఒకే కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్లు.. బదిలీలకు అర్హత కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. 

సర్కారు ఇచ్చిన జీవో ప్రకారం స్పౌజ్, మెడికల్ గ్రౌండ్ అంశాల్లో రెండేండ్ల నిబంధన తప్పనిసరి కాదని, ఈ విషయాన్ని విద్యాశాఖలోను అమలు చేయాలని డిమాండ్ చేశారు.