మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు చేపట్టాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ అధికారులకు సూచించారు. బుధవారం జిల్లాలో పర్యటించిన ఆయన కలెక్టర్ ఖుష్బు గుప్తాతో కలిసి భూత్పూర్లోని 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు విద్యుత్ వినియోగం, డిమాండ్కు అనుగుణంగా సరఫరా లో అంతరాయాలు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
సబ్స్టేషన్ పనితీరును పరిశీలించిన సీఎండీ, సబ్స్టేషన్పై ఉన్న విద్యుత్ లోడ్, ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుత్ సరఫరా గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో టీజీఎస్పీడీసీఎల్ ఎస్.ఈ.భీమనాయక్, డీఈ చంద్ర మౌళి, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
