హైదరాబాద్సిటీ, వెలుగు: టీజీఎస్ఆర్టీసీ కార్గో విభాగంలో కస్టమర్లు క్లెయిమ్ చేయని వస్తువులను సోమవారం వేలం వేస్తున్నట్లు కంటోన్మెంట్డిపో మేనేజర్కవిత ఒక ప్రకటనలో తెలిపారు. పార్సిల్ఫిట్మెంట్వాల్యూపై 50 శాతం తక్కువగా వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు.
ఆటోమొబైల్స్పేర్స్, బయోమెడికల్, క్లాత్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, జనరల్, ఫార్మా, స్టేషనరీ వంటివి 52 వస్తువులు ఉన్నాయన్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు జూబ్లీ బస్ స్టేషన్లోని కార్గో కౌంటర్లో వేలం జరుగుతుందని పేర్కొన్నారు.
