
ఆర్టీసీలో తొలి మహిళా కండక్టర్లుగా విధుల్లో చేరి 28 ఏళ్ల ఉత్తమ సర్వీసును పూర్తి చేసుకున్న ముగ్గురిని యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్లో దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన శ్రీదేవి, అనిత, మెహిదిపట్నం డిపో శారదను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సన్మానించారు. ఉన్నతాధికారులతో కలిసి వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు.
ALSO READ | బీఆర్ఎస్ హయాంలోనే బనకచర్లకు క్లియరెన్స్ : ఎంపీ అర్వింద్
ఎన్నో ఏళ్లుగా ప్రజా రవాణా వ్యవస్థలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తోన్న మహిళా కండక్టర్లను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్(ASRTU) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల న్యూఢిల్లీలో సత్కరించింది. అందులో టీజీఎస్ఆర్టీసీ నుంచి కండక్టర్లు శ్రీదేవి, అనిత, శారద ఉన్నారు. ఈ క్రమంలో ఆర్టీసీలో వారి సేవలను కొనియాడుతూ యాజమాన్యం సన్మానించింది. ఈ సన్మాన కార్యక్రమంలో సంస్థ ఈడీ మునిశేఖర్, సీపీఎం ఉషా దేవి, దిల్ సుఖ్ నగర్ డీఎం సమత తదితరులు పాల్గొన్నారు.
టీజీఎస్ఆర్టీసీ తొలి మహిళా కండక్టర్లకు సన్మానం!!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 18, 2025
ఆర్టీసీలో తొలి మహిళా కండక్టర్లుగా విధుల్లో చేరి 28 ఏళ్ల ఉత్తమ సర్వీసును పూర్తి చేసుకున్న ముగ్గురిని యాజమాన్యం అభినందించింది.
హైదరాబాద్ బస్ భవన్లో దిల్సుఖ్నగర్ డిపోనకు చెందిన శ్రీదేవి, అనిత, మెహిదిపట్నం డిపో… pic.twitter.com/bK09KxXBFQ