బీఆర్ఎస్ హయాంలోనే బనకచర్లకు క్లియరెన్స్ : ఎంపీ అర్వింద్

బీఆర్ఎస్ హయాంలోనే బనకచర్లకు క్లియరెన్స్ :  ఎంపీ అర్వింద్

బనకచర్ల ప్రాజెక్ట్ పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే బనకచర్లకు క్లియరెన్స్ ఇచ్చారని చెప్పారు అర్వింద్.  జగన్ ప్రపోజల్ మేరకే కేసీఆర్ ఆమోదం తెలిపారని అన్నారు.  హామీల వైఫల్యాలను  కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. కేసీఆర్  డైరెక్షన్ లో  తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టడానికి. ఇపుడు కాంగ్రెస్ కూడా డైవర్షన్ పాలిటిక్స్ కోసం  బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమం పెట్టారని చెప్పారు. 

ALSO READ| బ్రహ్మోస్ ఏరోస్పేస్ విస్తరణకు హైదరాబాద్ను ఎంచుకోండి: సీఎం రేవంత్రెడ్డి

 బనకచర్ల వల్ల తెలంగాణ జరిగే నష్టం ఎంతో  ఉత్తమ్ కు  తెల్వదన్నారు.  ఉత్తమ్..సగం కాంగ్రెస్..సగం బీఆర్ఎస్ అని ధ్వజమెత్తారు.  ఉత్తమ్  పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పిన వాళ్లకే టికెట్ ఇచ్చారని ఆరోపించారు.  కాంగ్రెస్ బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.   స్థానిక సంస్తల ఎన్నికల కోసం నాటకాలాడుతున్నారని విమర్శించారు అర్వింద్.  

ఆల్ పార్టీ ఎంపీల సమావేశంలో కూడా ఏమి ఉండదన్నారు.  తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఉత్తమ్ కు అవగాహన లేదన్నారు. ఎన్ని టీఎంసీలు అవసరం, ప్రాజెక్టుల వ్యయం ఎంత అనేది తెల్వదన్నారు. ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి డబ్బుల్లేవంటారని..ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతారని విమర్శించారు. 

ఏపీ,తెలంగాణ మధ్య ముదురుతోన్న బనకచర్ల వివాదంపై  తెలంగాణ ప్రభుత్వం ఆల్ పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యింది. బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నారు ఉత్తమ్. బీఆర్ఎస్, బీజేపీ,ఎంఐఎం,కాంగ్రెస్ నుంచి పలువురు రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు హాజరయ్యారు.