
- వచ్చే నెల నుంచే అందుబాటులోకి తేనున్న ఆర్టీసీ
- ఎక్కడెక్కడ అవసరమో చెప్పాలని విద్యాసంస్థలకు లెటర్లు
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్పరిధిలో వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి అదనంగా మరో 100 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గ్రేటర్ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గ్రేటర్పరిధిలో రోజు రోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. వీరి కోసం ఆర్టీసీ ప్రస్తుతం 2800 బస్సులను నడుపుతోంది.
ఇందులో 250 వరకు ఎలక్ట్రిక్ బస్సులున్నాయి. దాదాపు 150 వరకు ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సులను వివిధ రూట్లలో నడుపుతుండగా, 49 బస్సులు ఎయిర్ పోర్ట్ రూట్లలో, మరికొన్ని అవసరం ఉన్న రూట్లలో నడిపిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో 100 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురాబోతున్నట్టు అధికారులు చెప్తున్నారు.
విద్యాసంస్థలకు లెటర్లు
గ్రేటర్శివారు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లోనే వచ్చి వెళ్తుంటారు. దీంతో వీరి అవసరాలకు అనుగుణంగా బస్సులను పెంచబోతున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఎక్కడెక్కడి ప్రాంతాల్లో స్టూడెంట్స్కు బస్సు సౌకర్యం అవసరమో చెప్పాలంటూ ఆయా విద్యాసంస్థల మేనేజ్మెంట్లకు ఆర్టీసీ అధికారులు లెటర్లు రాస్తున్నారు.