థాయ్​లాండ్​లో పేలుడు..10 మంది మృతి

థాయ్​లాండ్​లో పేలుడు..10 మంది మృతి

బ్యాంకాక్​: ​ థాయ్ లాండ్​లోని ఓ బాణసంచా గోడౌన్​లో జరిగిన భారీ పేలుడు ధాటికి పదిమంది మృతిచెందారు. 118మంది ప్రజలు గాయపడ్డారని పబ్లిక్​ రిలేషన్స్ డిపార్ట్​మెంట్ అధికారులు తెలిపారు. సదరన్​ థాయ్​లాండ్​లో  ఈ ఘటన జరిగిందని, భారీ పేలుడుతో 200ఇండ్లు దెబ్బతిన్నాయని అధికారులు మీడియాకు వెల్లడించారు. 

శిథిలాల్లో చిక్కుకుపోయినవారి కోసం రెస్క్యూటీమ్ చర్యలు వేగవంతం చేసిందన్నారు. సంఘటన ప్రాంతంలో ఉన్న భవనాలు, కార్లు, మోటార్​ బైక్ లు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. భవనాలు, ఇండ్ల గోడలు, పైకప్పులు కూలిపోయాయి.  పేలుడు ప్రాంతంలో  కుప్పలుగా పడిఉన్న శిథిలాల వీడియోను అధికారులు సోషల్​మీడియాలో పోస్టు చేశారు. పేలుడు ప్రభావంతో ​ చుట్టుపక్కల 500 మీటర్ల దూరంలోని నివాసాలు కూడా దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు.