‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న రెండేళ్ల తర్వాత ‘సర్కారు వారి పాట’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు మహేష్ బాబు. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని మే 12న రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. వేలెంటైన్స్ డే సందర్భంగా ‘కళావతి’ సాంగ్ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది. త్వరలో మరో పాటను కూడా విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వయంగా రివీల్ చేశాడు. సెకెండ్ సాంగ్తో మరోసారి సూపర్ వైబ్స్ని తీసుకు రానున్నట్లు చెప్పాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహేష్ బాబుతో కలిసి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.
At the sets of #SarkaruVaariPaata ? Enjoying the whole vibe ?????@ParasuramPetla Nailing it ▶️▶️???? We are preparing For the Next ?▶️ thanks from Us for making our #Kalaavathi a #SensationalKalaavathi ????????? pic.twitter.com/jq8MuM5Dn6
— thaman S (@MusicThaman) February 24, 2022