తహసీల్దార్ విజయారెడ్డిని చంపిన సురేష్ మృతి

తహసీల్దార్ విజయారెడ్డిని చంపిన సురేష్ మృతి

హైదరాబాద్: తహసీల్దార్ విజయారెడ్డిని ఆఫీస్‌లోనే పెట్రోల్ పోసి నిప్పటించి హత్య చేసిన నిందితుడు సురేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భూ పట్టా విషయంలో ఆమె ఆఫీస్ చుట్టూ తిరిగిన సురేష్ విసిగిపోయి పెట్రోల్ బాటిల్‌తో తహసీల్దార్ ఆఫీస్‌కొచ్చిడు. ఆమె గదిలోకి వెళ్లిన సురేష్ తలుపు మూసి ఆమెపై పెట్రోల్ చల్లి, తనపై కూడా చల్లకొని నిప్పటించుకున్నాడు. ఆ ఘటనలో విజయారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, సురేష్ మాత్రం 60% కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. సురేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా వైద్యులు అతన్ని వెంటిలేటర్ మీదికి మార్చి రెండు సార్లు ఈసీజీ తీశారు. రెండు సార్లూ ఈసీజీలో పల్స్ రేట్ ఫ్లాట్‌గా రావడంతో హార్ట్ బీట్ ఆగిపోయినట్లుగా గుర్తించారు. కాగా, సురేష్ సాయంత్రం 3:25 నిమిషాలకు మరణించినట్లు ఉస్మానియా వైద్యులు నిర్ధారించారు. మరికొద్ది సేపట్లో పోస్టుమార్టం నిమిత్తం సురేష్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించనున్నారు.