చేనేత కార్మికులకు నగదు సాయం చేసిన కళామందిర్‌‌ ఫౌండేషన్

చేనేత కార్మికులకు నగదు సాయం చేసిన కళామందిర్‌‌ ఫౌండేషన్

కళామందిర్ ఫౌండేషన్ 15 వ వార్షికోత్సవం ఇటీవల నానక్‌‌రామ్ గూడాలోని ప్రధాన్ కన్వెన్షన్‌‌లో ఘనంగా జరిగింది.  సంస్థ తరపున 21 మంది చేనేత కార్మికులకు రూ. 21 వేల చొప్పున నగదు అందచేశారు. అంతేకాక, పలు సేవా స్వచ్చంద సంస్థలకు 6 లక్షల విరాళం అందచేశారు. కళామందిర్ సంస్థ ఉద్యోగుల పిల్లలకు , ఇతర అర్హులైన విద్యార్ధులకు 51 లక్షల మెరిట్ స్కాలర్‌‌‌‌షిప్స్ అందచేశారు. ఈ ఈవెంట్‌‌లో హోమ్‌‌ ఫర్ డిసబుల్డ్‌‌కు చెందిన దివ్యాంగ చిన్నారుల ఫ్యాషన్ షో ఆకర్షణగా నిలిచింది. ముఖ్య అతిధిగా ఎంపీ జోగినపల్లి సంతోష్  హాజరయ్యారు.