టీయూ గర్ల్స్​ హాస్టల్​ టిఫిన్‌‌లో కప్ప

టీయూ గర్ల్స్​ హాస్టల్​ టిఫిన్‌‌లో కప్ప

డిచ్​పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ లోని గర్ల్స్​ హాస్టల్​లో బుధవారం ఉదయం స్టూడెంట్స్​కి పెట్టిన టిఫిన్​లో కప్ప రావడం కలకలం సృష్టించింది. దీంతో పీడీఎస్​యూ లీడర్లు, స్టూడెంట్స్​ వర్సిటీ అడ్మిన్​ బిల్డింగ్​ను ముట్టడించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్​యూ వర్సిటీ ప్రెసిడెంట్​ రాజేశ్వర్​ మాట్లాడుతూ యూనివర్సిటీ ఆఫీసర్ల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతోనే టిఫిన్​లో  కప్ప వచ్చిందన్నారు. ఇట్లాంటి తిండి తిని స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. 450 మంది స్టూడెంట్స్​కి ఒకే గర్ల్స్​ హాస్టల్​ సరిపోవడం లేదని, మరో హాస్టల్​ నిర్మించాలని ఇప్పటికే ఎన్నోసార్లు వీసీ, రిజిస్ట్రార్​లకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్​లో కోతులు, పాములు తిరగడంతో క్లాస్​లకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. జరిగిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. పీడీఎస్​యూ వర్సిటీ సెక్రెటరీ సంతోష్​, స్టూడెంట్స్​పాల్గొన్నారు.