టీఆర్ఎస్ ను ఓడించాలని బీసీ పొలిటికల్ జేఏసీ పిలుపు

టీఆర్ఎస్ ను ఓడించాలని బీసీ పొలిటికల్ జేఏసీ పిలుపు

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీసీలు ఓట్లు వేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ పిలుపునిచ్చింది. బీసీ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేసీఆర్ కు వ్యతిరేకంగా గన్ పార్క్ ముందు ఆందోళనకు దిగారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మరోసారి హామీల పేరుతో మోసం చేసే కుట్ర చేస్తోందని జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్  ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ఫెడరేషన్లు, కార్పొరేషన్లు కనుమరుగయ్యాయని రాచాల యుగంధర్ ఆరోపించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోటాను తగ్గించారని రాచాల యుగంధర్ మండిపడ్డారు. 70శాతం ఉన్న బీసీలను రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను అన్ని విధాలుగా మోసం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మునుగుడులో బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలని రాచాల యుగంధర్ గౌడ్ ఓటర్లకు పిలుపునిచ్చారు.