రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై హైకమాండ్ ఫోకస్

రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై హైకమాండ్ ఫోకస్

హైదరాబాద్ BJP స్టేట్ ఆఫీస్ లో పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, MP అర్వింద్, ఎమ్మెల్యే ఈటల, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు ఇతర నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా నేతలు చర్చిస్తున్నారు. కార్యవర్గ సమావేశాల నిర్వహణపై ఏర్పాటు చేసిన కమిటీలతో మాట్లాడుతున్నారు లీడర్లు. 

మరోవైపు తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ హైకమాండ్... రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాల నేతలను ఇంచార్జ్ లుగా నియమించింది. దీనికి సంబంధించి లిస్ట్ రెడీ చేసిన కేంద్ర నాయకత్వం.... దాన్ని రాష్ట్ర నాయకత్వానికి పంపింది.  జాబితాలో కేంద్రమంత్రులు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మాజీ సీఎంలు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు.