బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది

బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మానేరు వాగులో ఈతకు వెళ్లి చనిపోయిన ఆరుగురు విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు. సిరిసిల్ల రాజీవ్ నగర్ కాలనీలోని వారి ఇళ్లకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు సంజయ్.