నిలోఫర్ హాస్పిటల్ లో బాలుడు మృతి

నిలోఫర్ హాస్పిటల్ లో బాలుడు మృతి

నిలోఫర్ హాస్పిటల్ లో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే వార్డ్ బాయ్ నిర్లక్ష్యంతో పసిబాలుడు ప్రాణం కోల్పోయాడని ఆరోపించారు ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి. ఎర్రగడ్డకు చెందిన ఖాజా పాషా అనే బాలుడి ఆరోగ్యం విషమించడంతో సుభాష్ అనే వార్డ్ బాయ్ ఆక్సిజన్ పెట్టకుండా సీటీ స్కానింగ్ కి తీసుకెళ్లారని..దాంతో బాలుడు చనిపోయాడని చెప్పారు. తర్వాత వార్డ్ బాయ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకొచ్చి వార్డ్ లో వదిలివెళ్లాడని ఆరోపిస్తున్నాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించి పసికందు  మృతికి కారణమైన.. వార్డు బాయ్ ను సస్పెండ్ చేసి.. బాధిత కుటుంబానికి  న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.