ప్రియురాలి తండ్రిని చంపిన ప్రియుడు, అతడి బంధువులు

ప్రియురాలి తండ్రిని చంపిన ప్రియుడు, అతడి బంధువులు

ఈడొచ్చినంక పెండ్లి ​చేస్తనన్నందుకు చంపేసిన్రు
రోకలిబండతో తలపై కొట్టడంతో ..ప్రాణాలు విడిచిన తండ్రి
కొడిమ్యాల, వెలుగు: తన బిడ్డ మైనర్ అని మేజర్ అయిన తర్వాత పెండ్లి చేస్తా అన్నందుకు ఆ అమ్మాయిని ప్రేమించిన వ్యక్తి బంధువులు రోకలిబండతో తలపై మోది చంపేసిన్రు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం సండ్రల్లపల్లిలో జరిగింది. మండలంలోని చింతకుంటకు చెందిన గడ్డం అంజయ్య(45), భార్య బూదవ్వ కూలి పని చేసుకునేవాళ్లు. పిల్లలు లేకపోవడంతో చిన్నప్పుడే సంగీతను దత్తత తీసుకున్నారు.

సంగీతకు ప్రస్తుతం 17 సంవత్సరాలు. ఈమెతో సండ్రల్ల పల్లికి చెందిన గడ్డం సంజీవ్ ప్రేమలో పడ్డాడు. దీంతో సంగీత వారం క్రితం సంజీవ్ ఇంటికి వెళ్ళింది. శుక్రవారం అమ్మాయి తల్లిదండ్రులు గ్రామానికి వెళ్లి సంగీత మైనర్ అని మేజర్ అయిన తర్వాత పెండ్లి చేస్తామని తీసుకురావడానికి ప్రయత్నించారు.

అయితే సీరియస్ అయిన సంజీవ్.. తన అక్క కనుకతార, బావ సమ్మయ్య, అల్లుడు పవన్ కళ్యా ణ్ తో కలిసి అంజయ్యపై రోకలిబండతో దాడి చేశాడు. తలపగలగా దవాఖానాకు తీసుకువెళ్తుండగా చనిపోయాడు. భార్య బూదవ్వ ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు కొడిమ్యా ల ఎస్ఐ శివకృష్ణ తెలిపారు.