కాలువలోకి దూసుకెళ్లిన కారు

కాలువలోకి దూసుకెళ్లిన కారు

తూర్పుగోదావరి: కొత్తపేట ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద ఓ కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లినట్లు సమాచారం. మహాశివరాత్రి సందర్భంగా వసంతవాడ ఉమా పార్వతీశ్వర స్వామి దేవాలయానికి కారులో వచ్చిన ఐదుగురు తెల్లవారుజామున తిరుగుపయనం అయ్యారు. కాలువ పక్కన ఎలాంటి ఫెన్సింగ్ లేకపోవడంతో అదుపుతప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఒకరు మృతి చెందారు. ఇద్దరు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మృతుడు పశ్చిమగోదావరి జిల్లా గొల్లలకోడేరు కు చెందిన సిహెచ్ శ్రీనివాసరాజుగా గుర్తించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.