టీఆర్ఎఫ్.. టెర్రర్ సంస్థే

టీఆర్ఎఫ్.. టెర్రర్ సంస్థే

న్యూఢిల్లీ: లష్కరే తోయిబా(ఎల్‌‌ఈటీ)కి చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్‌‌)ను టెర్రరిస్టు సంస్థగా కేంద్రం ప్రకటించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘టెర్రరిస్టు యాక్టివిటీస్‌‌ను ముందుకు తీసుకెళ్లేందుకు.. ఆన్‌‌లైన్‌‌ ద్వారా యువతను టీఆర్ఎఫ్ రిక్రూట్ చేసుకుంటున్నది. ఉగ్ర కార్యకలాపాలపై ప్రచారం చేస్తున్నది. టెర్రరిస్టులను నియమించుకుంటున్నది. పాక్​ నుంచి టెర్రరిస్టులను మన దేశంలోకి పంపిస్తున్నది.

కాశ్మీర్‌‌‌‌లోకి ఆయుధాలు, డ్రగ్స్‌‌ను స్మగ్లింగ్‌‌ చేస్తున్నది. కాశ్మీరీలను ప్రేరేపించేందుకు సోషల్ మీడియాలో సైకలాజికల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నది” అని కేంద్ర హోంశాఖ ఓ నోటిఫికేషన్‌‌లో పేర్కొంది.