- వాటాల అమ్మకంపై కేంద్రం దృష్టి
- సేల్కు స్పేస్, ఎనర్జీ, టెలికాం సెక్టార్లలోని పీఎస్యూలు
- ఏ ఏ కంపెనీలలో వాటాలు అమ్మాలనే దానిపై నీతిఆయోగ్ కసరత్తు
న్యూఢిల్లీ :
ప్రభుత్వ రంగ కంపెనీల నెంబర్ను ఇప్పుడున్న 300 నుంచి 30 లోపుకి కుదించాలని కేంద్రం ఆలోచిస్తోంది. నాన్–కోర్ సెక్టార్లోని కంపెనీలలో డిజిన్వెస్ట్మెంట్ వేగవంతం చేయాలని, నష్టాలతో నడుస్తున్న వాటిని మూసేయాలని ఇటీవలే కొత్త పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏ ఏ కంపెనీలను మూసేయాలి, ఏ ఏ కంపెనీలలో డిజిన్వెస్ట్ చేయాలనేది నీతీ ఆయోగ్ స్టడీ చేస్తోంది. నీతీ ఆయోగ్ రికమెండేషన్ మేరకు ఈ విషయంలో కేబినెట్ త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుంది. నాలుగు కోర్ సెక్టార్లను బడ్జెట్లో గుర్తించారు. ఆ సెక్టార్లలో ఒక్కో దానిలో మూడు నుంచి నాలుగు పీఎస్యూలను మాత్రమే అట్టేపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన అన్ని సెక్టార్లలోని పీఎస్యూల నుంచి బయటకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది.
స్ట్రేటజిక్ సెక్టార్ల నుంచి బయటకు..
బ్యాంకులు, ఇన్సూరెన్స్ రంగంలోని కంపెనీలలో పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలని ఆలోచిస్తోంది. అటామిక్ ఎనర్జీ, స్పేస్, డిఫెన్స్, ట్రాన్స్పోర్ట్, టెలికమ్యూనికేషన్స్, పవర్, పెట్రోలియమ్, కోల్, ఇతర మినరల్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లను స్ట్రేటజిక్ సెక్టార్లుగా గుర్తిస్తున్నట్లు బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వెల్లడించారు. స్ట్రేటజిక్ సెక్టార్లలో ప్రభుత్వ రంగ కంపెనీలు నామమాత్రంగా మాత్రమే ఉండాలని పాలసీ డెసిషన్ను గవర్నమెంట్ తీసుకుంది. దీంతో స్ట్రేటజిక్ సెక్టార్లలోని పీఎస్యూలను ప్రైవేటుకి అప్పచెప్పడంతోపాటు, కొన్నింటిని మెర్జ్ చేయడం, మరికొన్నింటిని వేరే పెద్ద కంపెనీలకు సబ్సిడరీలుగా చేయడం వంటి చర్యలను ప్రభుత్వం ప్రపోజ్ చేస్తోంది. కొన్నింటిని మూసేయాలనే ప్రతిపాదనా ఉంది.
సంస్కరణలను మరింత చురుగ్గా అమలు చేసే దిశలోనే ప్రభుత్వం అడుగులు వేయాలనుకుంటోందనే విషయం తాజా బడ్జెట్ ప్రకటనతో స్పష్టమవుతోంది. పీఎస్యూల ప్రైవేటీకరణ మరింత చురుగ్గా సాగించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉందనేదీ అర్ధమవుతోంది. వివిధ కంపెనీల పనితీరు మెరుగుపడేందుకు, సామర్ధ్యం మెరుగుపడేందుకూ ప్రైవేటుకి లేదా విదేశీ ఇన్వెస్టర్లకు అప్పచెప్పడమే కరెక్టని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు డిజిన్వెస్ట్మెంట్ ద్వారా తనకి అవసరమైన నిధులు సేకరించుకునే వీలూ ఉంటుందనేది ప్రభుత్వం ఆలోచన. కరోనా మహమ్మారితో పడిపోయిన ఎకానమీని పుంజుకునేలా చేయాలంటే ప్రభుత్వానికి నిధులు చాలా అవసరం.
యాక్టివ్గా 249 పీఎస్యూలు..
పబ్లిక్ ఎంటర్ప్రైజస్ సర్వే 2018–19 ప్రకారం దేశంలో 348 కంపెనీలు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. ఇందులో 249 పీఎస్యూలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మరో 86 నిర్మాణ దశలో ఉండగా, ఇంకో 19 పీఎస్యూలు క్లోజర్, లిక్విడేషన్ దిశలో ఉన్నాయి. కొత్త పాలసీతో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని, ప్రభుత్వ సీనియర్ ఆఫీసర్స్ చెబుతున్నారు. ఇంజినీర్స్ ఇండియా వంటి కన్సల్టింగ్ కంపెనీలు డజను దాకా ఉంటాయని, అలాంటి వాటిని కొనడానికి ముందుకు వచ్చేవాళ్లు తక్కువగా ఉంటారని, ఎందుకంటే వివిధ పీఎస్యూల నుంచి అవసరమైన ఉద్యోగులను తీసుకుని ఈజీగానే కొత్త కన్సల్టింగ్ కంపెనీలు పెట్టుకోవచ్చని అన్నారు. ఎక్కువ షేర్ అమ్మాలనుకుంటే మాత్రం ప్రభుత్వం జాగ్రత్తగానే పరిశీలించాల్సి ఉంటుంది. ఆయిల్ వంటి రంగాలలోని కంపెనీలలో భారీగా వాటాలను అమ్ముదామనుకుంటే, కొనే ప్రైవేటు కంపెనీలూ తక్కువగానే ఉంటాయనేది సీనియర్ ఆఫీసర్ల వాదన. ఇందుకోసం తగిన స్ట్రేటజీలను రూపొందించుకోవల్సి ఉంటుందని, ఏ సెక్టార్కి ఆ సెక్టార్ను ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుందని ఒక సీనియర్ ఆఫీసర్ పేర్కొంటున్నారు
భెల్, మెకాన్, ఆండ్రూ యూల్లో వాటా అమ్మకం ఈ ఏడాదే……
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్), మెకాన్ లిమిటెడ్, ఆండ్రూ యూల్ అండ్ కంపెనీ లిమిటెడ్లలో వాటాను ఈ ఏడాది అమ్మాలని ప్రభుత్వం చూస్తోంది. భెల్లో వాటా అమ్మాలని అడ్వైజర్గా ఉన్న ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ ప్రపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ ఎసెట్ మేనేజ్మెంట్ (దీపమ్)కు ఒక రిపోర్టును ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ అందచేసింది. దేశంలోని అతి పెద్ద పవర్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్ అయిన భెల్లో ఎంత వాటా అమ్మాలనే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి గవర్నమెంట్కు ఈ రిపోర్డు సాయపడుతుంది. మెకాన్ లిమిటెడ్, ఆండ్రూ యూల్ కంపెనీలలో వాటాల అమ్మకానికి కూడా ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్సే అడ్వైజర్గా వ్యవహరిస్తోంది. డిజిన్వెస్ట్మెంట్ ద్వారా మొత్తం రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని గవర్నమెంట్ ఈ ఏడాదికి టార్గెట్గా పెట్టుకుంది. ఎయిర్ ఇండియా, బీపీసీఎల్లలో వాటాల అమ్మకం రాబోయే ఫైనాన్షియల్ ఇయర్కు పోస్ట్పోన్ కావడంతో, 2019–20లో డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్స్ను గవర్నమెంట్ అందుకోలేకపోయింది. భెల్లో ప్రభుత్వానికి 63.17 శాతం వాటా ఉంది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫారిన్ ఇన్వెస్టర్ల చేతిలోనూ కొన్ని వాటాలున్నాయి. థర్మల్, గ్యాస్, హైడ్రో, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కోసం ఎక్విప్మెంట్ను తయారు చేయడంలో భెల్ పేరొందింది. భెల్కు మొత్తం 16 మాన్యుఫాక్చరింగ్ యూనిట్లున్నాయి. టీ, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, ల్యూబ్రికెంట్స్, ప్రింటింగ్ రంగాలలో ఆండ్రూ యూల్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మెటల్స్, మైనింగ్ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెకాన్, ఇటీవల ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పేస్, డిఫెన్స్లలో డైవర్సిఫికేషన్ ప్రాజెక్టులపైనా దృష్టి పెట్టింది.