ఆడుకుంటూ వెళ్లి సంపులో పడిన చిన్నారి మృతి

ఆడుకుంటూ వెళ్లి సంపులో పడిన చిన్నారి మృతి

రంగారెడ్డి జిల్లా: ఆడుకుంటూ ఓ చిన్నారి సంపులో పడి మృతి చెందిన సంఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని  పిఅండ్ టి కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనానికి వాచ్ మన్ గా పనిచేస్తున్న సువర్ణ మనుమరాలు మల్లేష్ మహేశ్వరి దపంతుల కూతురు రిషిక  ఆడుకుంటుంటూ వెళ్లి మూత తెరిచి ఉన్న సంపులో పడిపోయింది. 
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులు, అవ్వ, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపించారు. ఇదిలా ఉంటే సంపు పై మూత ఏర్పాటు చేయకపోవడమే పాప మృతికి కారణం అయిందని స్థానికులు పేర్కొన్నారు.