
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘నింద’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా తను నటిస్తున్న మరో మూవీకి సంబంధించిన అప్డేట్ను ప్రకటించారు మేకర్స్. వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వంలో బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం ‘ది కానిస్టేబుల్’. మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయమవుతోంది. బుధవారంతో ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని తెలియజేశారు.
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో సినిమా ఉండబోతోందని, పోలీస్ పాత్రలో వరుణ్ సందేశ్ ఆకట్టుకుంటారని దర్శకుడు ఆర్యన్ సుభాన్ చెప్పాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తామని నిర్మాత అన్నారు. దువ్వాసి మోహన్, రవి వర్మ, మురళీధర్ గౌడ్, ప్రభావతి, కల్పలత ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నాడు.