స్వాతంత్య్ర ఉద్యమంలో మీ పాత్ర ఏంటంటూ బీజేపీని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా బీజీపీ నేతలపై ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్ సమైక్యత ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏంటీ అని అడిగారు. కేంద్ర హోంమంత్రి హైదరాబాద్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతలు వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ చరిత్రను హైజాక్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కవితను ఆరోపించారు. రాష్ట్రాలకు వచ్చి హామీలివ్వడం, ప్రజలు వారిని తిరస్కరించగానే వంచించడం బీజేపీ కి అలవాటగా మారిందన్నారు. తెలంగాణ బిడ్డగా, వీటి సమాధానాల కోసం ఎదురు చూస్తున్నానని కవిత ట్వీట్ చేశారు. దేశంలో ప్రజల హక్కుల కోసం బీజేపీ చేసిందేమి లేదని విమర్శించారు. తెలంగాణ అస్తిత్వం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సీఎం కెసీఆర్ కు కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు.
The contribution of the BJP towards efforts to give people their rights for our country stands to be nothing.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 17, 2022
Harmony, togetherness, and the power of people - this is the foundation of Telangana and CM KCR and it takes a lot of courage to be him.
(4/4)