
హైదరాబాద్: సున్నం చెరువు దగ్గర హైడ్రా కూల్చివేతలు వివాదస్పదంగా మారాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు సున్నం చెరువు వద్ద హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సోమవారం (జూన్ 30) సున్నం చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు.
లే అవుట్లోని ప్లాట్లను కూల్చి వేయడంపై ఎమ్మెల్యే గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నం చెరువులో కూల్చివేతలను వెంటనే ఆపేయాలని అధికారులను ఆదేశించారు. కూల్చివేతలు చేపట్టిన జేసీబీలను ఎమ్మెల్యే గాంధీ వెనక్కి పంపారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ హైడ్రా అధికారులు మండిపడుతున్నారు. పేదల ఇళ్లు కూలగొట్టడంపై సీరియస్ అయ్యారు.