ఓల్డ్సిటీ, వెలుగు: దేశ సంస్కృతీ సంప్రదాయాలను యువత కాపాడాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. మంగళవారం సాలార్ జంగ్ మ్యూజియం 74వ వార్షికోత్సవానికి ఆయన గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూడు తరాల నిజాం చరిత్రను ఈ మ్యూజియం ప్రతిబింబిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి దాన కిషోర్, అకౌంటెంట్ జనరల్ చందా పండిత్, వైస్ చాన్స్లర్ మొల్గారాం, సాలార్ జంగ్ మ్యూజియం బోర్డు సభ్యులు నవాబ్ అతరం అలీ ఖాన్, డైరెక్టర్ప్రియాంక మేరీ పాల్గొన్నారు.
