ఈవీఎం, వీవీ ప్యాట్ల తరలింపు

ఈవీఎం, వీవీ ప్యాట్ల తరలింపు

వనపర్తి, వెలుగు : పార్లమెంట్​ ఎన్నికల నిర్వహణ కోసం మొదటి ర్యాండమైజేషన్  అనంతరం ఎన్నికల కమిషన్  సూచనల మేరకు ఈవీఎం, వీవీ ప్యాట్లను పోలీసు బందోబస్తు నడుమ చిట్యాలలోని వ్యవసాయ మార్కెట్  యార్డ్​ గోదామ్​కు తరలించారు. కలెక్టర్​ తేజస్​నందలాల్​ పవార్​  ఆధ్వర్యంలో శనివారం

ఆర్డీవో ఆఫీస్​ ఆవరణలోని ఈవీఎం గోదామ్​ నుంచి ప్రజా ప్రతినిధుల సమక్షంలో క్లోజ్డ్  కంటైనర్ లో పోలీస్ భద్రతతో  మార్కెట్ యార్డ్​కు తరలించారు. అసిస్టెంట్​ రిటర్నింగ్  ఆఫీసర్​ నగేశ్, తహసీల్దార్  యాదగిరి, వివిధ పార్టీల ప్రతినిధులు ప్రవీణ్, కుమారస్వామి,  పరమేశ్వరాచారి, వేణాచారి, భరత్, శేఖర్, రహీమ్  ఉన్నారు. 

ఈవీఎంల అప్పగింత

గద్వాల : మొదటి విడత ర్యాండమైజేషన్  పూర్తి అయిన తర్వాత ఈవీఎంలను ఆలంపూర్, గద్వాల రిటర్నింగ్  ఆఫీసర్లకు అందించినట్లు కలెక్టర్  సంతోష్  తెలిపారు. శనివారం కలెక్టరేట్ లోని ఈవీఎం గోదామ్​లో పొలిటికల్  పార్టీ లీడర్ల సమక్షంలో ఓపెన్ చేసి వాటిని పరిశీలించి కేటాయించారు. వాటిని ఆయా నియోజకవర్గాల గోదామ్​లో భద్రపర్చినట్లు చెప్పారు. అడిషనల్  కలెక్టర్లు అపూర్వ్  చౌహాన్, వెంకటేశ్వర్లు, తహసీల్దార్  నరేశ్​ ఉన్నారు.