బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా రిలీజ్

బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా రిలీజ్

నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో 202 - 2023 విద్యా సంవత్సరానికి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుదలైంది. ఇంచార్జ్ వీసీ వెంకట రమణ, డైరెక్టర్ సతీష్ ఈ జాబితాను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 33వేల 5 దరఖాస్తులు రాగా.. 1404 మంది విద్యార్థుల ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థుల్లో బాలికలకు  73శాతం సీట్లు, బాయ్స్ కు 27శాతం సీట్లు కేటాయించారు.

ఆర్జీయూ కేటీలోని 99శాతం సీట్లను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించడం గమనార్హం. అత్యధికంగా సిద్దిపేట జిల్లా 212 సీట్లు సాధించి ఫస్ట్ ప్లేస్ లో నిలవగా.. అత్యల్పంగా6 సీట్లు సాధించి మహబూబ్ నగర్ జిల్లా లాస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఎంపికైన విద్యార్థులకు ఈనెల 28, 29, 30 తేదీల్లో క్యాంపస్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.