ప్రజల్లో ధైర్యం నింపేందుకే పోలీసుల ఫ్లాగ్ మార్చ్

ప్రజల్లో ధైర్యం నింపేందుకే పోలీసుల ఫ్లాగ్ మార్చ్
  • కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్

సుజాతనగర్, వెలుగు :  ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. సుజాతనగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్​నుంచి  నాయకులగూడెం వరకు మంగళవారం సెంట్రల్ పోలీస్ ఫోర్స్, స్థానిక పోలీసు సిబ్బంది కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. చుంచుపల్లి, జూలూరుపాడు సీఐలు రాయల వెంకటేశ్వర్లు, ఇంద్రాసేనారెడ్డి, ఎస్సై లు జూబెదా బేగం, జీవన్ రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.