బస్సు రన్నింగ్​లో ఉండగా.. ఊడిన ముందు టైరు

బస్సు రన్నింగ్​లో ఉండగా.. ఊడిన ముందు టైరు

కోహెడ, వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నకిరేకొమ్ములలో ఆదివారం బస్సు రన్నింగ్​లో ఉండగా ముందు టైరు ఊడిపోయింది. స్థానికుల కథనం ప్రకారం.. కోహెడ నుంచి 12 మంది ప్రయాణికులతో మినీ బస్సు కరీంనగర్​ వెళ్తోంది. నకిరేకొమ్ములకు రాగానే ముందు టైరు ఊడిపోయింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును అదుపు చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.