హైదరాబాద్ : సిటీలో పలుచోట్ల వర్షం కురుస్తుంది. మొజాంజాహి మార్కెట్, కోఠి, సుల్తాన్ బజార్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో వర్షం కురిసింది. వర్షంలోనూ గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. ఎన్టీఆర్, పీవీ మార్గ్ తో పాటు ట్యాంక్ బండ్ పరిసరాల్లో భక్తులు సందడి చేస్తున్నారు. ట్యాంక్ బండ్ కు వైపునకు వచ్చే దారులన్నీ భక్తులతో కిక్కిరిపోయాయి. గణపతి బొప్పా మోరియా నినాదాలతో నగరం మార్మోగిపోతోంది. ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర ఎన్టీఆర్ మార్గ్ కు చేరుకుంది. మరికాసేపట్లో క్రేన్ నంబర్ 4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరగనుంది.