- ఈ ఏడాది బడ్జెట్లో రూ.22,615 కోట్ల కేటాయింపులు
- మైనర్ ఇరిగేషన్కు రూ.2,054 కోట్లు
- డిపార్ట్మెంట్కు తగ్గిన రుణభారం
- నిరుడు రూ.9,958 కోట్లు.. ఇప్పుడు రూ.8,879 కోట్లు
- రుణాల రీస్ట్రక్చర్తో డిపార్ట్మెంట్కు కొంత ఉపశమనం
హైదరాబాద్, వెలుగు:
రాష్ట్ర బడ్జెట్లో ఇరిగేషన్ శాఖకు నిధుల కేటాయింపు తగ్గింది. గత బడ్జెట్తో పోలిస్తే ఈ ఏడాది రూ.758 కోట్లు తగ్గించారు. నిరుడు బడ్జెట్లో రూ.23,373 కోట్ల కేటాయింపులు చేయగా.. ఈ ఏడాది రూ.22,615 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో కేటాయింపులు తగ్గించడంతో ఆ మేరకు బడ్జెట్లో కోత పడింది. నిరుడు బడ్జెట్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.2,685 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అయితే, ఈ ఏడాది ఆ ప్రాజెక్టు నిధుల్లో భారీగా కోతలు పెట్టింది. కేవలం రూ.230.43 కోట్లే కేటాయించింది. అక్కడ మిగిలిన నిధులను ఇతర స్కీములకు ప్రభుత్వం అడ్జస్ట్ చేసింది.
అయితే, చెరువుల అభివృద్ధి, రిపేర్లు తదితర పనుల కోసం మైనర్ ఇరిగేషన్కు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. ఆ మేరకు నిధులను పెంచింది. అందులో ప్రాజెక్ట్ బ్యారేజీల పనులకు రూ.90.33 కోట్లు కేటాయించింది. కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీల కోసం మరో రూ.134.53 కోట్లు ప్రతిపాదించింది. నిరుడు మైనర్ ఇరిగేషన్కు కేవలం రూ.1,313 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.2,054.44 కోట్లకు పెంచింది. వరదల నియంత్రణ, నివారణ కోసం మరో రూ.280 కోట్లు కేటాయించింది.
ప్రాధాన్య ప్రాజెక్టులకు నిధులు..
ప్రభుత్వం ప్రాధాన్యంగా పెట్టుకున్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులోనూ ప్రాధాన్యమిచ్చింది. నారాయణపేట కొడంగల్ లిఫ్టుకు గతంతో పోలిస్తే కేటాయింపులు పెంచారు. ఆ ప్రాజెక్టుకు ఈ ఏడాది రూ.1,104 కోట్లు కేటాయించగా.. గత బడ్జెట్రూ.849 కోట్లతో పోలిస్తే నిధులు రూ.250 కోట్ల మేర పెరిగాయి. పాలమూరు రంగారెడ్డికి రూ.వంద కోట్లు పెంచి.. రూ.1,800 కోట్లు ప్రతిపాదించింది ప్రభుత్వం.
కల్వకుర్తికి రూ.800 కోట్లు, ఏఎమ్మార్పీ ఎస్ఎల్బీసీకి రూ.800 కోట్లు, డిండి లిఫ్ట్ స్కీమ్కు రూ.600 కోట్లు, దేవాదులకు రూ.485 కోట్లు, సీతారామ సీతమ్మసాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టుకు రూ.336 కోట్ల కేటాయింపులను ప్రతిపాదించింది. ఇక, కృష్ణా బోర్డుకు రూ.14 కోట్లు కేటాయించింది. కాగా, ఇరిగేషన్ శాఖ బడ్జెట్ గత నాలుగేండ్లుగా తగ్గుతూ వస్తున్నది. 2023=24లో రూ.29,766 కోట్లు కేటాయించగా.. 2024=25లో రూ.23,492 కోట్లు, 2025=26 బడ్జెట్లో రూ.23,373 కోట్లు కేటాయించారు. ఈ నాలుగేండ్లలో ఇరిగేషన్ శాఖ బడ్జెట్లో రూ.7,151 కోట్లు తగ్గింది.
తగ్గిన రుణభారం..
బడ్జెట్లో ఈ ఏడాది రుణభారం స్వల్పంగా తగ్గింది. నిరుడు రూ.9,958.89 కోట్లు రుణాల కోసం కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తం రూ.8,879.82 కోట్లుగా ఉంది. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం తీసుకున్న రుణ చెల్లింపులే రూ.6,191.82 కోట్లుగా ఉంది. వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద మరో రూ.2,688 కోట్లు (నిరుడు బడ్జెట్లో రూ.2962.47 కోట్లు) రుణాల కోసం ప్రభుత్వం కేటాయించింది.
నిరుడు కేటాయించిన రూ.6,996 కోట్లతో పోలిస్తే కాళేశ్వరం రుణాలకు చెల్లించాల్సిన మొత్తం రూ.804 కోట్లు తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశం. ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్చొరవ తీసుకుని కేంద్రంలో రుణాలను రీస్ట్రక్చర్ చేయించడంతో రుణభారం కొంత తగ్గి ఉపశమనం లభించినట్టయింది.
వివిధ ప్రాజెక్టులకు కేటాయింపులు..
ప్రాజెక్ట్ మొత్తం (రూ.కోట్లలో)
చిన్న తరహా
ఎత్తిపోతలు-(టీజీ ఐడీసీ) 500
శ్రీపాద ఎల్లంపల్లి 447
ఎర్రుపాలెం ఎన్ఎస్పీ
లిఫ్ట్ స్కీమ్ 370.99
ఎస్సారెస్పీ స్టేజ్2 276.86
ఇందిరమ్మ
వరద కాలువ 250
నెట్టెంపాడు 232.50
నాగార్జునసాగర్ 196.85
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 119.90
లోయర్ పెన్గంగ 177
రాజీవ్ భీమా 119.22
మోడికుంటవాగు 90
జూరాల 88
నీల్వాయి ప్రాజెక్టు 81
నిజాంసాగర్ 71
కోయిల్సాగర్ 56
ప్రాణహిత- చేవెళ్ల 52
పెద్దవాగు 50
