మోడీకి వచ్చిన గిఫ్ట్స్ వేలం.. అక్టోబర్ 3 వరకు ఛాన్స్

మోడీకి వచ్చిన గిఫ్ట్స్ వేలం.. అక్టోబర్ 3 వరకు ఛాన్స్

ప్రధాని మోడీకి వచ్చిన కానుకలను రేపు వేలం వేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సారి 1222 బహుమతులకు వేలం జరుగుతోందన్నారు. ప్రారంభ ధర 200 రూపాయల నుంచి 2.5 లక్ష వరకు ఉంటుందన్నారు. 2019 నుంచి ఈ వేలం కొనసాగుతోందని చెప్పారు. ఇందులో 25 బహుమతులు క్రీడాకారులు ఇచ్చినవేనని తెలిపారు. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగ మిషన్ కు అందజేస్తారు.

‘‘ప్రధానిగా మోడీ ఎన్నో ప్రదేశాలు పర్యటిస్తారు. ఎందరినో కలుస్తుంటారు. ఈ సమయంలో ప్రధానికి గౌరవంగా బహుమతులు ఇస్తుంటారు. దేశ చరిత్రలో మొదటిసారి ఆ బహుమతులన్నింటిని మోడీ దేశం కోసం వెనక్కి ఇస్తున్నారు. ఓ చిన్నారి మోడీ వేసుకున్న శాలువా కావాలని గతంలో లేఖ రాసింది. దీనికి స్పందించిన ప్రధాని శాలువాను చిన్నారికి పంపించారు’’ అని కిషన్ రెడ్డి తెలిపారు.