డయాగ్నస్టిక్ హబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏడబోయినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌?

డయాగ్నస్టిక్ హబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏడబోయినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌?
  •     రెండేండ్లు కావొస్తున్నా ప్రారంభంకాని హబ్​లు
  •     ఒక్క హైదరాబాద్​లో ఏర్పాటు.. దానికీ 60% నిధులు కేంద్రానివే
  •     16 జిల్లాల్లో బిల్డింగులు పూర్తి.. టెండర్ల దశలోనే పరికరాల కొనుగోలు

హైదరాబాద్, వెలుగు‘‘రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ డయాగ్నస్టిట్​ హబ్​లు ఏర్పాటు చేస్తాం”ఇదీ మునుపటి టర్మ్​లో సీఎం కేసీఆర్​ సర్కార్​ ఇచ్చిన హామీ. సర్కార్​ దవాఖాన్లలో రోగులకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించాలన్న ఉద్దేశంతో ఈ హబ్​లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఒక్క హైదరాబాద్​ తప్ప మిగతా ఏ జిల్లాలోనూ హబ్​ల ఊసే లేదు. ప్రభుత్వం టైంకు నిధులు ఇవ్వకపోవడం వల్లే హబ్​ల పనులు ముందుకు కదలట్లేదని అధికారులు చెబుతున్నారు. 2018 జూన్​లో హైదరాబాద్​ హబ్​ను ప్రారంభించారు. దానికీ నేషనల్​ హెల్త్​ మిషన్​ కింద కేంద్ర ప్రభుత్వమే 60 శాతం నిధులిచ్చింది. ప్రస్తుతం అక్కడ రోజూ 4 వేల రక్త నమూనాలను పరీక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 16 జిల్లాల్లో హబ్​ల ఏర్పాటుకు అవసరమైన నిధుల్లో 60 శాతం ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది. కానీ, రెండేళ్లవుతున్నా హబ్స్​ఏర్పాటు కాలేదు. బిల్డింగులు కట్టి వదిలేశారంతే. డయాగ్నస్టిక్​ పరికరాలు, యంత్రాల కొనుగోళ్లకు టెండర్లు పిలిచారు. అది పూర్తై హబ్​లు ప్రారంభమవడానికి మరో ఐదారు నెలలు టైం పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కేంద్రం టైంకు నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం వల్లే హబ్​ల ఏర్పాటు ఆలస్యమవుతోందని ఎన్​హెచ్​ఎం అధికారులు చెబుతున్నారు.

హబ్స్​ ఏర్పాటు చేయాలనుకున్న జిల్లాలివీ

సంగారెడ్డి, మెదక్​, నిజామాబాద్​, కొత్తగూడెం, ఆదిలాబాద్​, నిర్మల్​, కరీంనగర్​, మహబూబ్​నగర్​, గద్వాల, వికారాబాద్​, నల్గొండ, జనగామ, ములుగు, ఖమ్మం, ఆసిఫాబాద్​, జగిత్యాల​.