ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులివ్వండి

ప్రభుత్వానికి  కోర్టు ధిక్కరణ నోటీసులివ్వండి

ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.మెజిస్ట్రేట్ కోర్టు ఆర్డర్స్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు, మెజిస్ట్రేట్ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మధ్యాహ్నాం 12 గంటలకు మెడికల్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశిస్తే... సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎందుకివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంపై సుమోటోగా కోర్టు ధిక్కరణ నోటీసులివ్వాలని జ్యూడిషియల్ రిజిస్ట్రార్ ను ఆదేశించింది. సీఐడీ అడిషనల్ డీజీ,స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.