
హైకోర్టు మొట్టికాయలు వేసినా… ప్రభుత్వానికి చలనం లేదన్నారు విపక్ష నేతలు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో…. గందరగోళంతో చనిపోయిన అనామిక కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ పాల్గొన్నారు. ఉద్యమాలను అణచటం, ప్రశ్నించే గొంతులను నొక్కేయటమే సర్కార్ పనిగా పెట్టుకుందన్నారు నేతలు.