భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపంతో భర్త సూసైడ్

భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపంతో భర్త సూసైడ్

శంషాబాద్, వెలుగు: భార్య తనను విడిచి పెట్టి పుట్టింటికి వెళ్లిందనే మనస్తాపంతో భర్త సూసైడ్ చేసుకున్న ఘటన మైలార్ దేవ్​పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. అబ్దుల్ షాహెద్ ఖాన్(38) మైలార్ దేవ్​పల్లి పరిధి వట్టేపల్లిలోని సైఫి కాలనీలో ఉంటున్నాడు. అతడికి భార్య,కూతురు(10), కొడుకు(8) ఉన్నాడు. ఆటోడ్రైవర్​గా పనిచేస్తున్న షాహెద్ కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఇటీవల పిల్లలను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లడంతో మరింతగా మనోవేదనకు గురయ్యాడు. గురువారం తన అన్నదమ్ములకు వాట్సాప్​లో గ్రూప్ వీడియో కాల్ చేసిన షాహెద్ లైవ్​లోనే ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకున్నాడు. షాహెద్ సోదరులు వెంటనే డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు షాహెద్ ఇంటికి చేరుకునేలోగా అతడు చనిపోయి ఉన్నాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మద్యం మత్తులో మరొకరు..

జీడిమెట్ల: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఉరేసుకున్న ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. కుత్బుల్లాపూర్ భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన శ్రీకాంత్(30) ఎలక్ట్రిషీయన్​గా పనిచేస్తున్నాడు. రెండ్రోజుల కిందట అతడి భార్య పుట్టింటికి వెళ్లింది. మద్యానికి బానిసైన శ్రీకాంత్ తాగిన మత్తులో గురువారం ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.